-->

Friday, July 7, 2023

మల్లవరపు జాన్ " అస్పృశ్యత " పద్యాలు


"నాక మునుండి యూడిప డెనా? యొకరుండు; మఱొక్కరుండధో
లోకమునుండి వచ్చెనె? ప్రలోభులు స్వార్ధము నెంచి మానవా
నీకమునందు నగ్రజులు నిమ్న జులన్న విభేద తత్వముల్
వాకొని మభ్య పెట్టి వెలివాడల నుంచిరి నిన్ను; సోదరా!" అని మధుర కవి మల్లవరపు జాన్ "అస్పృశ్యత " అనే పద్య ఖండికలోని ఈ పద్యంలో అంటాడు!
 "చెప్పారాని కులం" అని దళితులగూర్చి మాట్లాడేవారికి బుద్ధి చెప్పడానికి బదులు భయపడుతూ... వారే ఎదురైతే నమస్కారాలంటూ ఎంతకాలం సహిస్తావంటూ తన దళిత సోదరులను కవి నిలదీసి స్వార్ధపరుల కుట్రను వివరించాడు 

"ఎక్కువ మా కులమ్మను మహీ సురులైన వివాహవేళ నా
చుక్కలలోని నీయనుగు సోదరియైన 'అరుంధతీ' సతిన్
'మొక్కులు వెట్టి చూచి శుభముల్గొను చుండగ నీకులం బెటుల్
తక్కువయయ్యె; దుర్జనుల తంతులు
చిత్రవిచిత్రముల్ గదా!" అని మరోపద్యంలో అంటాడు కవి. మనం తక్కువ కులమనీ, వారు ఎక్కువ కులం అని చెప్పుకునేవారు, వివాహ సమయంలో  మన సోదరి అరుంధతీకి  నమస్కరిస్తూ వారు శుభం పొందుతున్మప్పుడు మన కులం తక్కువెలా అవుతుంది? ఇవన్నీ దుర్జనుల పనులుగా గ్రహించమని తన జాతి జనులలోని ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టే హితవచనాలు చెబుతాడు కవి మల్లవరపు జాన్.
 
అస్పృశ్యులు, నిమ్నజాతి వారంటూ సమాజంలో దళితులను దళితేతరులు తక్కువ వారిగా చూస్తుంటే...  దళితులు మాల మాదిగలనే బేధంతో ఉంటే...  సమానత పొందేదెపుడు, వారితో కలిసి తిరిగేదెపుడని ప్రశ్నించాడు కవి. ఇంటగెలిచి రచ్చగెలవాలి అనే సామెతను తన జాతిజనానికి ఇలా గుర్తు చేస్తున్నాడు కవి.
"మాల యతడు; నేను మాదిగ కులజుడ;
నను విభేద ముండు నంత దనుక
కలిసి తిరుగ లేవు గద! కులీనుల తోడ
ఇంట గెలిచి రచ్చ కేగుమయ్య!"


మల్లవరపు జాన్ ఛందో బద్ధమైన రచన ప్రౌఢమైనది కాదు. అతి సరళమైన శైలి.సమాజ హితాన్ని చాటడమే గాక... కుల వివక్షను ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం సభ్యుడు. "విశ్వ ప్రకాశము" ఖండకావ్యం. 20 శీర్షికలతో ఇందులో పద్యాలు ఉన్నాయి.
ఆ విధంగా వ్యవహరిచేవారు స్వర్గం నుండో అధోలోకం నుండో రాలేదు... స్వార్థంతో ఎక్కువ తక్కువలు సృష్టించి వెలివాడలో నుంచిని సత్యాన్ని  


No comments:

Post a Comment