-->

Sunday, September 18, 2022

తెలుగు తక్కువ-కాలేజీ

https://youtube.com/shorts/qf2CL5C7Fzg?feature=share

పేరులోనే ఉన్నత విద్య. ఉత్తుత్తి విద్యా విధానంగా అధికారులు తయారు చేస్తూ ప్రభుత్వ ఆశయాలను నీరుగారుస్తున్నారు. అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్. కాలేజీ లో సంస్కృతం బోధించే అధ్యాపకుల విద్యార్హత వివరాలు ఆర్టిఐ ద్వారా అడిగితే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో "కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ " ఉండి కూడా తమ అఫిలియేటెడ్ కాలేజీలలో ఏ సబ్జెక్టును ఏ విద్యార్హత గలవారు బోధిస్తున్నారో వారి దగ్గర ఉండాల్సిన సమాచారం లేకపోవటం విచారకరం. ఇదీ కళాశాలల పర్యవేక్షణ. సిడిసి దుస్థితి. కాలేజీలో సంస్కృతం బోధించే అధ్యాపకులలో ఎం.ఎ. సంస్కృతం చదివిన వారు ఒక్కరే! మిగతా ఇద్దరూ పి.జి. తెలుగు చదివినవారే!

ఏ.ఎం.ఏ.ఎల్ కాలేజీలో తెలుగు సబ్జెక్ట్ వర్క్ లోడ్ గూర్చి, బోధించే అధ్యాపకుల విద్యార్హత వివరాలు గూర్చి, అధికారుల అనుమతి లేకుండానే సంస్కృతం సబ్జెక్ట్ ను నిర్వహించుకోవడం గూర్చి రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) రాజమహేంద్రవరం వారిని ఆర్టిఐ ద్వారా కోరితే వారి వద్ద తప్పనిసరిగా ఉండాల్సిన సమాచారం కూడా లేక అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్. కాలేజీ నుండి తెప్పించుకుని ఇచ్చే దుస్థితిలో ఆర్జేడీ అధికారులు ఉన్నారు.
ఏ.ఎం.ఏ.ఎల్ కాలేజీలో తెలుగు సబ్జెక్ట్ వర్క్ లోడ్ గూర్చి, బోధించే అధ్యాపకుల విద్యార్హత వివరాలు గూర్చి, అధికారుల అనుమతి లేకుండానే తెలుగు తీసివేసి సంస్కృతం సబ్జెక్ట్ ను నిర్వహించుకోవడం గూర్చి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వారిని ఆర్టిఐ ద్వారా కోరితే అరా కొర సమాచారం ఇచ్చి అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్. కాలేజీ వారు 2020-2021 విద్యాసంవత్సరం ఎటువంటి యూ.జి. అన్ ఎయిడెడ్ ప్రోగ్రామ్ మంజూరు చేయలేదని తెలియజేశారు.
పెరుమాళ్ళపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ఏ.ఎం.ఏ.ఎల్ కాలేజీకి లో నేను వచ్చింది మొదలు తెలుగు సబ్జెక్ట్ వర్క్ లోడ్ తీసివేసి నన్ను దూరంగా మరో కాలేజీ కి మార్చే వ్యూహం లో భాగంగా నా పై కక్షతో, కాలేజీ విద్యార్థులు ఏమైపోయినా ఫర్వాలేదని నా తెలుగు ఎయిడెడ్ పోస్ట్, తెలుగు సబ్జెక్ట్ ఉండగా అధికారుల అనుమతి లేకుండా తెలుగు తీసివేసి సంస్కృతం పెట్టి పిల్లల్ని బలవంతంగా కూర్చోబెట్టి నిర్వహిస్తున్నారు కాలేజీ మేనేజ్మెంట్. 95% కంటే ఎక్కువగా తెలుగు విద్యార్ధులు పాసయ్యే వారు. ఇప్పుడు సంస్కృతం పాసయినవారు 40%
ఇంత జరుగుతున్నా, నేను అనేక లేఖలు ద్వారా కళాశాలలో తెలుగు వర్క్ లోడ్ గూర్చి, సంస్కృతం సబ్జెక్ట్ అనుమతి లేకుండా మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న విషయాలు తెలియజేసినా వచ్చి విచారించిన ఆర్జేడీ, కమీషనర్ కార్యాలయం అధికారులే లేరు! రెండు సంవత్సరాల నుండి నన్ను కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారని, నన్ను 42జి.వొ. ద్వారా వేరే కళాశాలకు మార్చమని తెలియజేసినా స్పందించని కమీషనర్ కాలేజీ మేనేజ్మెంట్ వారు నాపై కక్ష సాధింపుగా చేసే చట్టవ్యతిరేకమైన పనులకు మేనేజ్మెంట్ కు తన పూర్తి సహాయ - సహకారాలు అందజేస్తున్నారు.
విద్యా వ్యవస్థను పరిరక్షించడంలో కంటే, మేనేజ్మెంట్ వారు నన్ను శిక్షించడంలో తన సహాయ సహకారాలు బాగా అందిస్తున్నారు. ఈ కాలేజీ పై తన పర్యవేక్షణ లేకపోగా, కళాశాల రూల్స్ కు విరుద్ధమైన చర్యలపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ, మురిసిపోతూ తన మద్దతు ప్రదర్శిస్తున్నారు కమీషనర్ గారు.

సిగ్గుపడకుండా ఒక్కడిపై ఒక వ్యవస్థకు చెందిన వందలమంది అనైతిక యుద్ధం.



స్ప్రైట్ యాడ్లోలా సూటిగా సుత్తి లేకుండా ఏ.ఎమ్.ఏ.ఎల్. కళాశాల మేనేజ్మెంట్ ను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. నాపై చర్యలు కోరుతూ డిస్మిసల్ అనుమతికై అడ్వొకేట్ ఎంక్వయిరీ రిపోర్ట్ ను ఆర్జేడీ ద్వారా కమీషనర్ కు సమర్పించి వారి ప్రొసీడింగ్స్ వచ్చాక నన్ను డిస్మిస్ చేయాలని ఎదురు చూసినవారు.... రిటైర్డ్ సీనియర్ జడ్జిచే చాలా శాస్త్ర బద్ధంగా, పారదర్శకంగా ఎంక్వయిరీ నిర్వహించామని గొప్పలు చెప్పుకున్న మేనేజ్మెంట్ వారు మొదటి లాగే మీ ఎంక్వయిరీ రిపోర్ట్ ను ఆర్జేడీ ద్వారా కమీషనర్ కు సమర్పించి వారి ప్రొసీడింగ్స్ కొరకు ఎందుకు ఎదురు చూడలేదు? మీకు డిస్మిస్ చేసే అధికారమే ఉంటే కమీషనర్ ను కోరకుండా మొదటి ఎంక్వయిరీ రిపోర్ట్ సబ్మిషనప్పుడే నన్ను డిస్మిస్ చేసేవారు కదా!

మీ సస్పెన్షన్ లు, సరెండర్ లు, డిస్మిసల్ తో నా నోరు మూయించలేరు. భయపడే రకాన్ని కాదు. నీతిగా రూల్స్ ప్రకారం పోరాటం చేయలేనివారు మాత్రమే ఎన్నిసార్లు భంగపడ్డా సిగ్గులేకుండా ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడి రాక్షస ఆనందాన్ని కొన్ని రోజులు అనుభవిస్తారు. ఊరూ-వాడ, అందరూ గమనిస్తున్నారు ఎవరిది నీతి వంతమైన పోరాటమో, ఎవరివి అనైతిక చర్యలో!

ఒక్కడిపై ఒక వ్యవస్థే...వందల మంది కలిసి కుట్రలుచేస్తూ నన్ను ఎదుర్కోవడానికి మీరు పడుతున్న పాట్లు జనం గమనిస్తూ నవ్వుకుంటున్నారు.

సరెండర్ తీర్మానంపై తెరవెనుక సూత్రధారులు సైతం ముందుకొచ్చి సంతకాలు చేశారుకదా. ఆ సంతకాలకు విలువుందా?చెల్లాయా? అధికారులు సరెండర్ ఆమోదించలేదు. మర్లా ఈ డిస్మిసల్. కాలం సమాధానం చెబుతుంది. కర్మఫలాన్ని అనుభవిస్తారు. ఇది రేపటి చరిత్రగా చెప్పుకుంటారు.

అనకాపల్లి, ఏ.ఎమ్.ఎ.ఎల్. కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ అక్రమ సర్వీస్ డిస్మిసల్ పై రిలే నిరాహారదీక్ష

 


అనకాపల్లి, ఎ.ఎమ్.ఎ.ఎల్. కాలేజీ మేనేజ్మెంట్ వారు తెలుగు అధ్యాపకుడైన డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ను నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల అనుమతి లేకుండా సర్వీస్ డిస్మిసల్ చేసినదానికి నిరసనగా దళిత సంఘాల మద్దతుతో 16-09-2022 ఉదయం 10 గంటలకు అనకాపల్లి కలెక్టరేట్ ఆఫీసు ఎదురుగా రిలే నిరాహారదీక్ష చేయడం జరిగింది. గతంలోనూ వివిధ నిరాధార ఆరోపణలతో అధికారుల అనుమతి లేకుండానే డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ను సరెండర్, సస్పెన్షన్ చేయడం జరిగింది. కళాశాల కరస్పాండెంట్ దాడి శ్రీనివాసరావు కులం పేరు తో దూషించడమేగాక; వివిధ సమావేశాల్లో పృథ్విరాజ్ ను కించపరుస్తూ అతని పట్ల వేధింపులకు పాల్పడిన కారణంగా పృథ్విరాజ్ కరస్పాండెంట్ పై అట్రాసిటీ కేసు పెట్టాడు. మరోమారు కూడా దళిత అధ్యాపకులతో ఇతర కులాలవారు ఫోటోలు దిగగా దానిపై కూడా వాట్సాప్ గ్రూప్ లో కులాన్ని కించపరస్తూ కరస్పాండెంట్ దాడి శ్రీనివాసరావు రాయడంతో రెండవ అట్రాసిటీ కేసు పెట్టాడు. ఈ రెండింటి పై అరెస్టు కాకుండా ఆర్డర్ తెచ్చుకుని మరింత వేధించడం ప్రారంభించారు. ఈ రెండు అట్రాసిటీ కేసులు ఉపసంహరించుకోవాలని వత్తిడి చేస్తూ మేనేజ్మెంట్ ఈ రకమైన సర్వీస్ డిస్మిసల్ కు పూనుకున్నారు. దళిత సంఘాలు ఈ విషయంపై కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించగా సాకుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వారి హామీమేరకు దీక్ష విరమించడం జరిగింది.