-->

Tuesday, June 27, 2023

శ్రీరంగం నారాయణబాబు✓


    "ప్రేమకు ప్రాణాలిచ్చే స్త్రీలు
    ఉరికొయ్యల్లాంటి మగాళ్ళు
    ... ... ...
    గుమస్తాలంతా గుల్లగాళ్ళు
    బీదవాళ్ల నెత్తురు
    బీరులాగ తాగేస్తారు
    ... ... ...
    ధర్మాన్ని పశువునిచేసి
    పట్టపగలు కోర్టులోన
    వధచేసి, సాయంత్రం
    సురాపానంలో చప్పరించి
    నంచుకుంద్రు" అని 'విశాఖపట్టణం' అనే గీతంలో అంటారు నారాయణ బాబు. ఒక స్థలాన్ని వర్ణించిన ఆధునిక స్థలపురాణం ఈ గీతం! "సర్రియలిజం" అనే "అధివాస్తవికత " కవితా నిర్మాణం శైలిలో నారాయణ బాబు రచనలు చేశారు. తెలుగు సాహిత్యంలో అధివాస్తవిక కవిత్వాన్ని ప్రవేశపెట్టిన ప్రముఖులలో
ఒకరు శ్రీరంగం నారాయణరా బాబు. అతి నవ్యకవితా రీతులలో కవితా చిత్రాలను చిత్రించే సమర్ధ కవి. నాటక రంగంలోనేగాక, "భక్త 
కబీర్" సినిమాలోకూడా నారాయణ బాబు నటుడిగా నటించారు.

    "పల్లకీ దిగినట్టి
    పెళ్ళికొడుకులు మీరు
    పట్టుతివాసీని నేను
    నడవండి, నడవండి!
    నామీంచి నడవండి!!" అని "గడ్డిపరక" అనే గీతంలో వర్ణిస్తాడు. గడ్డిపరక పేదలకు ప్రతీకైతే..‌‌., వీరి జీవితాలపై నడుచుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళేవారికి ప్రతీక ధనికులు.  పశువుల నోటికి పాయసాన్నంగా కూడా వర్ణించాడు కవి.
"నీ
పాటల కత్తులతోనే
నా
హృదయం నెత్తురుతీసి
నే
వెలిగించిన
దీపపు కాంతిని నర్తింపుముర
శ్రీ
శ్రీశ్రీ!" అని శ్రీశ్రీ పై కవిత రాశారు.

నారాయణ బాబు రచనలు:
విశాఖపట్నం
ఫిడేలు నాయుడుగారి వేళ్ళు
గడ్డిపరక
గేదెపెయ్యె
తెనుగురాత్రి
రుధిరజ్యోతి
కపాలమోక్షం
కిటికీలో దీపం
ఊరవతల
పండగనాడు
మౌన శంఖం
సంపంగి తోట
    ఈరోజు శ్రీరంగం నారాయణ బాబు గారి జయంతి సందర్భంగా ఈ వీడియో. అధివాస్తవికతను అనుసరించే కవితాశైలి నారాయణ బాబుది. అధివాస్తవికత ను ఇంగ్లీష్ లో సర్రియలిజం అంటారు.  ఊహను, వాస్తవాన్ని అనుసంధానిస్తూ వ్యక్తీకరించే రచనా ప్రక్రియనే అధివాస్తవికత... లేదా సర్రియలిజం అంటారు. 

No comments:

Post a Comment